చెత్తను తొలగించండి సారూ..!
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ పరిధి రంజోల్ గ్రామంలోని 4 పోస్ట్ ఆఫీస్ ముందు రోడ్డు ఎంట్రన్స్ నుంచి నక్షత్ర వెంచర్ మధ్యలో ఉన్న మురికి రోడ్డుపైకి రావడంతో కాలనీ ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తీసివేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.