ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి
కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మాట్లాడుతూ దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను స్మరించుకున్నారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ,మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యచరణ మహోన్నతమైందని తెలిపారు. భారతదేశంలో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న దాస్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.కుల లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతి బాపులే ను స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే విద్యా కు ఇచ్చిన ప్రధాన్యత తో వెనబడిన తరగతుల గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసుకున్నామని వెల్లడించారు. బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచడానికి చట్టం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలతో ముందుకు పోతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్, గోలి కిరణ్ , గుడిశాల పరమేశ్వర్ , బొమ్మ శీను , మారపల్లి ప్రశాంత్ , కారింగుల రాజేందర్,మీస రాజయ్య, గంగారపు మహేష్ ,కోడం శ్రీనివాస్, తోడేటి కిషన్ ,గురుకుంట్ల స్వామి , అన్నారపు సాయి, బండి మల్లయ్య ,మ్యాడిద తిరుపతిరెడ్డి, కారెట్ల పెళ్లి మణి, మోటపోతుల రాము, దారా నరేష్, జక్కు కుమార్ ,మంకు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..