మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ JAC అధ్యక్షులు.

President President

ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు చిలుముల రమేష్

రామడుగు, నేటిధాత్రి:

 

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన గల్ఫ్ జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలు మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక కోట ఇవ్వాలని, గల్ఫ్ లో ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఉపాధి లేక ఉన్న కుటుంబాలకు బ్యాంక్ ద్వారా జీవన ఉపాధి కల్పించాలని, నకిలీ ఏజంట్లపై చేర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి రామడుగు మండల అధ్యక్షులు మోడీ రవీందర్, చిలుముల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!