అకాల వర్షంనీకి దెబ్బతిన్న పంటల పరిశీలన
కొత్తగూడ, నేటిధాత్రి:
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల రాళ్ల వర్షలతో పంట పొలాలను అతలాకుతలం చేసి రైతులను రోడ్డున పడే పరిస్థితి తెచ్చిన ప్రకృతి…
దెబ్బతిన్న పంట పొలాలను చూసి రైతుల కష్టాలను వారి బాధలను దగ్గరగా చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.ధనసరి సీతక్క
తక్షణమే అకాల వర్షాలతో రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ చేత పరిశీలన చేసి నష్టపరిహారం వచ్చే విదంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పిన మాట ప్రకారం కొత్తగూడ మండలంలోని జంగంవాని గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి వినోద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు అకాల వర్షాలు రాళ్ల వానలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు… అకాల వర్షాలు రాళ్లవానతో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు బ్యాంకు వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి పంట పొలాలను సర్వే చేపించారు..పంట నష్టపోయిన రైతులందరు వారి వివరాలు ఇచ్చి నష్టపరిహారం పొందగలరని అని ఆయన అన్నారు…