శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు 2 లక్షలు విరాళం.
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బీరువోల నిర్మల – త్రిలోక రెడ్డి దంపతులు నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి నూతన శివాలయ ప్రతిష్టాపనకు 200116/- అక్షరాలా (రెండు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళం ఇస్తామని ప్రకటించడం జరిగింది..అందులో భాగంగా గురువారం రోజున 50000 /- ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్, ప్రధాన కార్యదర్శి సర్వ శరత్, కోశాధికారి మందల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం, తీగల నాగరాజు, తిప్పణవేణి రవి, బొమ్మ శంకర్, అనగాని రాజయ్య, మోతుకూరి రాజు, కాల్వ సమ్మిరెడ్డి, చెక్క నర్సయ్య, .ప్రధాన అర్చకులు రఘునందన్ శర్మ పాల్గొన్నారు.