కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎంపీ వద్దిరాజు భేటీ.

Kumaraswamy Kumaraswamy

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ

“నేటిధాత్రి” న్యూఢిల్లీ.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డి.కుమారస్వామితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన్ను కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Kumaraswamy
Kumaraswamy

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు.ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వస్తున్నదని,వారు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!