“పేదల గురువు” మానయ్య మృతి
” విద్యార్థుల సంతాపం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన మానయ్య సార్ (రిటైర్డ్) మంగళవారం మృతి చెందారు. సాంఘిక శాస్త్రంతో పాటు గణితం తెలుగు ఆంగ్ల భాష ఉర్దూ పై అపారమైన పరిజ్ఞానం కలిగి ఉండేవారు. ఇంగ్లీషులో ఎం.ఎ పట్టభద్రులైన మానయ్య, తెలుగు , ఉర్దూ భాష జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి వద్ద అభ్యసించారు. దిగ్వాల్ జడ్పీ హైస్కూల్లో, ఝరాసంగం జడ్పీ హైస్కూల్లో సేవలు అందించారు. పేదల ఉపాధ్యాయులుగా పేరు పొందిన మానయ్య సార్ హాస్టల్ల్లో చదువుతున్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధలు చూపించేవారు. ఆయన మార్గదర్శకంలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత హెూదాలలో సేవలందిస్తున్నారు. ఆయన అంతక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన మునిపల్లి మండలం పెద్దలోడిలో జరుగుతాయని బంధువులు స్నేహితులు తెలిపారు. ఉపాధ్యాయుడు మృతికి ఝరా సంగం విద్యార్థులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.