విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

students

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తీసుకొని పొదుపు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఈ పొదుపే మీ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం చాలా ఉపయోగపడు తుందని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు అని అన్నారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి వాటి నుండి తస్మాత్ జాగ్రత్త అని విద్యార్థులకు తెలియజేశారు, ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్స్ గాని ఓటీపీలు గాని ఎవరికి షేర్ చేయవద్దని అన్నారు, ఒకవేళ తెలియక సైబర్ నేరాల వలలో పడినట్లయితే వెంటనే గుర్తించి బ్యాంకును గాని పోలీసులను గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని తద్వారా మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు.
ఇదే రోజున ఈ హాస్టల్లో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది, విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది

students
students

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఈ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలియజేశారు.
నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదివి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను, ఈ పాఠశాలలో చదువుకు న్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అదేవి ధంగా మీరందరూ కూడా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని మరియు సిబ్బంది, మరియు ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విడ్స్ స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్స్ మారపెల్లి క్రాంతికుమార్, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!