తిర’గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం
పెరుగుతున్న పవన విద్యుత్
* సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టులు
* రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు
* మరికొద్ది రోజుల్లో అదనపు విండ్ టవర్లు

జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త కొత్త
టెక్నాలజీని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేపడుతు న్నారు. రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పరిశ్రమలతోపాటు గృహాల్లోనూ విద్యుత్ అవసరాలు ఎక్కువయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
11,730 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఝరాసంగం మండలంలో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11,730 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు నిర్వాహకులు తెలి పారు. ఒక రోజులో సుమారు 25 నుంచి 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సంవత్సరంలో జూన్ నుం చి అక్టోబర్ మధ్యలో గాలులుగా ఎక్కువగా వీయడంతో విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఆరు నెలలకొ కసారి టర్బైన్ టవర్ల నిర్వహణ చేపడుతారు.
రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు
హీరో ప్యూచర్ పవన విద్యుత్ ప్రాజెక్టు సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పారు. ఇప్పటివరకు 13 టర్బైన్ టవర్లను ఏర్పాటు చేయగా మరికొన్ని ఏర్పాటు చేసేం దుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం, ఒక్కో టర్బైన్ టవర్ సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మాణం కానుంది.
వికారాబాద్ జిల్లాలో
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 48 టర్బైన్ టవర్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యు ద్దుత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
నిమ్డ్ ఏర్పాటు నేపథ్యంలో
జహీరాబాద్ నియోజకవర్గంలోని యురాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్స్ (జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండ లి) 12,635 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. నిమ్టే ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ను సరఫరా చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో హీరో ఫ్యూచర్స్ ప్రాజెక్టు
జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని చీలపల్లి, చీలపల్లి తండా, బర్దిపూర్, ఎల్గోయి గ్రామ శివా రులో అనువైన స్థలాలను గుర్తించారు. హీరో ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల ఎత్తులో 13 పవర్ జనరేటింగ్ టర్బైన్ టవర్స్తో కూడిన విద్యుద్దుత్పత్తి ప్రాజెక్టును నెల కొల్పారు. ఒక్కో టర్బైన్ టవర్ వీచే గాలి సామ ర్థ్యాన్ని బట్టి ఒక రోజులో 2.1 మెగావాట్ల విద్యుద్దు త్పత్తి జరుగుతుంది. 100 మెగావాట్ల విద్యుదు
తృప్తి సామర్థ్యం గణ ప్రాజెక్టును ఏర్పాటు చేశాడు.
ప్రస్తుతం రోజుకి 25 నుంచి 21 మెగావాట్ల విద్యు ద్దుత్పత్తి జరుగుతుంది. ఝరాసంగం మండలం పరిధిలోని కుప్పానగన్ – మార్పూర్ గ్రామాల శివా దులో ప్రత్యేకంగా సడి ప్లేషఏర్పాటు చేశారు. ఉత్పత్తి చేసిన విద్యుడు సబ్ స్టేషనీరు సరఫరా చేసి అక్కనుంచి జహీరాబాద్ శివారులోని కాశీం పూర్ ప్రభుత్వ సరీ స్టేషన్ కు తరలిస్తారు. ఇక్కడి నుంచి అవసరాల మేరకు ఇతర ప్రాంతాలది.
* ఆంధ్రప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో పవన విద్యుత్, తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు.
* రాష్ట్రంలో సంగారెడ్డి, వికారాబాద్ తోపాటు పలు జిల్లాలోని ప్రాంతాల్లో పవన విద్యుదుత్పత్తికి అనుకూలమని జాతీయ పవన విద్యుదుత్పత్తి సంస్థ సర్వే వెల్లడించింది.
* సంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్ జిల్లాలో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలి గిన ప్రాజెక్టులను నెలకొల్పారు. ఆయా జిల్లాల్లో కొన్నేళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
* సోలార్ విద్యుదుత్పత్తి కేవలం ఎండ ఉన్న సమ యాల్లోనే జరుగగా పవన విద్యుత్ మాత్రం వీచే గాలిని బట్టి 24 గంటలూ జరుగుతుంది.