ట్రాఫిక్ నిబంధనలు వాహనాలు నడిపే వారు పాటిo చాలి

జయంట్ కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి:
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రాణాలు రక్షించుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లోభాగంగా మంగళవారంవనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో హెల్మెట్ పెట్టుకొని ద్విచక్ర వాహనo నడిపే వారిని, సీట్ బెల్ట్ తో కార్ నడుపుతున్న వారిని జిల్లా రోడ్డు రవాణా అధికారిమానస,పోలీస్ ల తో కలిసి వాహనదారులకు పూలు ఇస్తూ అభినందించారువాహనం నడిపే ప్రతి ఒక్కరు ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాన్ని రక్షించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఎవరైతే నిబంధనలు పాటించడం లేదో అలాంటి వారికి జరిమానాలు విధించాలని రోడ్డు రవాణాశాఖ ఆర్ టి ఓ ను ఆదేశించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అడ్డం దిడ్డంగా, అధిక వేగంతో నడపకుండ రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరారు. రోడ్డు రవాణాశాఖ ఆర్ టి ఓ మానస, డి.పి.ఆర్. ఒ సీతారాం, సబ్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!