నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి.

పెళ్లి చూపులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ప్రమాదం

నాగర్ కర్నూలు జిల్లాలో ఆదివారం రాత్రి కాంక్రీట్ లారీ, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రామకోటి (36) వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన గణేష్ (34) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పిఆర్ఓలుగా పనిచేస్తున్నారు. రామకోటికి ఇంకా పెళ్లి కాలేదు. దేవరకొండ వైపు ఉన్న ఓ గ్రామానికి పెళ్లి చూపుల కోసం ఆదివారం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి మరో రెండు నిమిషాల్లో చేరుకునే లోపు.. చారకొండ మండలం జూపల్లి రెవెన్యూ శివారు పరిధిలో ఓ దాబా పక్కనే కాంక్రీట్ లోడుతో వెళుతున్న లారీ వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. డ్రైవర్ గమనించకుండా కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. ఏదో శబ్దం వస్తుందని గమనించి లారీని నిలిపి చూడగా.. గారికి వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయి ఉన్నది. పరిశీలించి చూడగా.. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గణేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికులు పోలీసులు అతికష్టం మీద ఇరుక్కుపోయిన రామకోటి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కొట్ర, తాండ్ర గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!