నెట్టెంపాడు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు.

ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలి.

గద్వాల/ నేటి ధాత్రి.

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నియోజకవర్గంలోని చాగాపురం, షాబాద్, బుడ్డారెడ్డిపల్లి, సెనగపల్లి గ్రామాలలోనీ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 99వ, 100వ, విస్తరణ పనులను పరిశీలించి ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలని, మల్లెందొడ్డి గ్రామం దగ్గర 106 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటర్ కాలువలో పేరుకొనిపోయిన సిల్ట్ పనులు పూర్తి చేసి, తూములకు షట్టర్స్ ఏర్పాటు చేసి తాటికుంట లింకు కెనాల్ ఏర్పాటు చేస్తే చివరి ఆయకట్టు గ్రామాల రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులలో భాగంగా 99వ 100వ,106 డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులను త్వరగా పూర్తి చేస్తే అయిజ, ఇటిక్యాల, వడ్డేపల్లి, మనవపాడు మండల రైతులకు సాగునీరు అందించడం ద్వారా 35 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావున ప్యాకేజీ పనులు త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి హనుమంత రెడ్డి,వావిలాల రంగారెడ్డి, పుల్లూరు పరమేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్రాములు, గోవర్ధన్ రెడ్డి, తిప్పన్న,జయన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!