భూసార పరీక్షల ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది- ఎవో త్రివేదిక

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి, గోపాలరావుపేట గ్రామాలలో గుండిగోపాలరావుపేట క్లస్టర్ ఎఈవో అనంతరాజ్ రైతుల పొలాల నుండి మట్టి నమూనాలను భూసార పరీక్షల కోసం సేకరించడం జరిగిందన్నారు. గత ఇరవై రోజుల నుండి క్లస్టర్ పరిధిలోని తిర్మలాపూర్, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయదికారిణి త్రివేదిక పాల్గొని భూసార పరీక్షల వలన నేలలోని పోషకాల లభ్యత, అనుకూల పంటలు, చౌడు భూములను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, భూసార పరీక్షల ఆధారంగా, ఎరువుల వినియోగం, పంటల సాగు చేసుకున్నట్లయితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!