గీత కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం

*తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్.*

*గీతా కార్మికుడున్ని పరామర్శించిన తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ.*

*వరంగల్ జిల్లా ప్రతినిధి/పర్వతగిరి,నేటిధాత్రి:*

రాష్ట్రంలో ప్రతిరోజు వందల సంఖ్యలో గీతా వృత్తి ప్రమాదాలు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు.వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం వెంకటనారాయణ గౌడ్ వృత్తిధర్మంలో భాగంగా ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలపాలుకాగా సమాచారం తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ నాయకులు హాస్పిటల్లో చికిత్సా పొందుతున్న బాడితున్న వారు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి,గట్టు నరేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వృత్తి ప్రమాదాలు జరిగి గాయపడిన మరణించిన తక్షణ సహాయ నిధి కింద గీత కార్పొరేషన్ ద్వారా రూ.15 వేలు,25 వేల రూపాయలు బాధిత కుటుంబ సభ్యులకు అందించేవారని అన్నారు.ప్రస్తుత నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడిచిన నేటికి బాధితులకు ఎలాంటి తక్షణం సహాయం,అలాగే మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అందించడం లేదని మండిపడ్డారు. ఇకనైనా గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గీతా వృత్తి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. గీత కార్మికులు ప్రమాదానికి గురి అయితే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటే భయపడి ప్రైవేటు హాస్పిటల్ లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో బిల్లులు కట్టుకోలేక బాధితులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం వారికి అయినా వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నాగపురి వెంకటేష్ గౌడ్, నందు గౌడ్, మధుసూదన్, రాజు, దొడ్డుపల్లి రఘుపతి, నందగోపాల్, ఉదయ్ కుమార్, సతీష్ తదితర గౌడ నాయకులు పాల్గొని బాధితుడిని పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!