నేషనల్ హైవే భూనిర్వాసిత రైతుఖాతల్లో డబ్బులు జమ

నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త

ఆర్డీవో మంగీలాల్

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రీన్ఫోల్ద్నేషనల్ హైవే భూనిర్వాసిత రైతులకు ప్రభుత్వం నుండి చెల్లించే నగదు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని భూపాలపల్లి ఆర్డీవో మంగిలాల్ తెలిపారు. మంగళ వారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వెల్లుతున్న నేషనల్ హైవే భూనిర్వాసితులకు ఇవ్వవలసిన డబ్బులు ఎకరానికి 21లక్షల నుండి 28 లక్షల వరకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు.చిట్యాల మండలంలోని కాల్వపెల్లి, గిద్దముత్తారం, నవాబుపేట, టేకుమట్ల మండలంలోని రాఘవపూర్,పంగిడిపల్లి, అంకుషాపూర్,సోమనపల్లి గ్రామాలు న్నాయిని, మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈ గ్రామాలకు ఈ హైవే లో భూములు కోల్పోయారని అన్నారు.చిట్యాల మండలం నవాబ్ పేట, టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లె గ్రామంలోని రైతులకు వారి ఖాతల్లో మంగళ వారం జమచేయడం జరిగిందని అన్నారు.మొత్తం 16 కోట్ల 29లక్షల 6వేల 413 డబ్బులను రైతుల ఖాతల్లో జమచేయడం జరిగిందని తెలిపారు. పంగిడిపల్లి,నవాబ్పట గ్రామాల రైతులకు 98 మందికి డబ్బులు జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన రైతులు ఆర్డీవో ఆఫీస్లో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రైతులను కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!