చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సెక్టార్ మీటింగ్ జయప్రద సూపర్వైజరు సమక్షంలో రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్తు లు అయినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. సెక్టార్ మీటింగ్ ఎజెండా అంశాలు 2024 సంవత్సరము ముగియడంతో ఈ సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. ముగ్గురు మినీ అంగన్వాడీ టీచర్స్ కు మెయిన్ టీచర్స్ గా ముగ్గురుఆయాలకు టీచర్స్ గా టోటల్గా జిల్లా కలెక్టర్ గారు డిడబ్ల్యూఓ గారు కలిసి ఈ సంవత్సరం 6 గురు ఆయాలకు టీచర్స్ గా ప్రమోషన్స్ ఇప్పించి పది ఓన్ బిల్డింగ్ లకు పెయింటింగ్ రిపేర్ చేయించడం జరిగింది. 4 అంగన్వాడి కేంద్రాలకు టీవీలు ఇప్పించడం ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు బలోపేతం చేయడానికి మండలంలో మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి ప్రీ స్కూల్ కిట్టులను ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పించారు. ఈ సమావేశంలో ముందస్తుగా 2025 సంవత్సరానికి కేక్ కట్ చేసి స్వాగతం తెలుపుతూ వచ్చే సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచుకోవాలని వివరించడం జరిగింది. జీ జయప్రద సూపర్వైజర్ 30 మంది అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు.