జమ్మికుంట : నీటి దాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఆవరణంలో చిరువ్యాపారులతో శ్రమదానం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హెల్త్ అసిస్టెంట్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కూరగాయలు కొనుగోలు, అమ్మకాలు చేసే వారు ప్రతిరోజు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు కుళ్లిపోయిన కూరగాయలను మున్సిపల్ వాహనానికిఅందించినట్లయితే కుళ్ళిన కూరగాయలతో ఎరువు తయారు చేస్తామని దానికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లు అందించకుండా, జ్యూట్ బ్యాగ్ ఉపయోగించే విధంగా వినియోగదారులకు తెలియజేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలోఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ జవాన్లు రవి, సంపత్ లతో పాటు పలువురు పరిశుద్య కార్మికులు,అగ్రికల్చర్ మార్కెట్ సిబ్బంది, కూరగాయల చిరు వ్యాపారాలు పలువురు పాల్గొన్నారు.