ఐఎన్ టియుసి మండల ప్రెసిడెంట్ మారేపల్లి రాజేందర్
శాయంపేట నేటిధాత్రి:
ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ ను ఆపార్టీ నుంచి అధిష్టానం వెంటనే సస్పెండ్ చేయాలని ఐ ఎన్ టి యు సి మండల ప్రెసిడెంట్ మారపెల్లీ రాజేందర్ డిమాండ్ చేశారు. తన్వీదర్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతర కరమని పేర్కొన్నారు. మారపల్లిరాజేందర్ మాట్లా డుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటు వంటి కుటుంబం అని గుర్తు చేశారు బిజెపి పెద్దల అండతో రెచ్చిపోయి తన్వీదర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈవాక్యాలను ఢిల్లీ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.బిజెపి పెద్దలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉందని, అలాంటి వారిని విడిచిపెట్టవద్దని సూచించారు. తన్వీదర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య లకు నిరసనగా జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమా లు చేపడతామని హెచ్చరిం చారు.