నస్పూర్ మున్సిపాలిటీ లో హైడ్రా అమలుపరుస్తున్న మున్సిపల్ అధికారులు

అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా

గంటల వ్యవధిలో ఐదు అంతస్తుల భవనం కూల్చివేత

మంచిర్యాల, నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపి స్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. జిల్లాలకూ హైడ్రాను విస్తరింపజేయాలని సామాన్యులతో పాటు అధికార పక్షనేతలు, డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదిరి గానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీ మునిసిపాలిటీ,ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సి పల్ అధికారులు ఈరోజు ఉక్కుపాదం మోపారు.
నస్పూర్ మున్సిపాలిటీ లోని 42 సర్వే నెంబర్ లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు.
ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్
భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40 లో అనుమతు లు సర్వే నంబర్ 42 లో చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు.
ఈ విషయమై 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించు కోలేదన్నారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జరి చేశామని చెప్పారు. పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని ఈరోజు పూర్తిగా నెలమట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *