జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి.

క్యాతం సతీష్ కుమార్. ఐజేయు జిల్లా అధ్యక్షులు.

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయని, యేళ్ళ నాటి శని వదిలిందని ,ప్రతీ జర్నలిస్ట్ తన హక్కులను సాకారం చేసుకోబోయే తరుణం మీడియా అకాడమి చైర్మెన్‌ కె శ్రీనివాసరెడ్డి ద్వారా ఆసన్నమయ్యే సమయం వచ్చేసిందన్నారు.
హైదరాబాద్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగిన టియు డబ్ల్యూ జే ఐజేయు స్టేట్ ఎమర్జెన్సీ ఎక్స్టేండేడ్ ఎక్జిక్యూటివ్ కమిటిలో మీడియా అకాడమీ చైర్మేన్ శ్రీనివాసరెడ్డి కి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కోనే సమస్యలైన…. ఇళ్ళ స్థలాలు,అక్రిడేషన్,హెల్త్ కార్డు ల గూర్చి వివరించగా వారు సానుకూలంగా స్పందించి,అతీ త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో “జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం” ఏర్పాటు చేసి, తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కోంటున్న అన్ని సమస్యలకి ఆ సభా వేదిక ద్వారానే శుభవార్త తెలియజేస్తానని తెలపడం చాలా సంతోషకరమని టియుడబ్ల్యూజే( ఐ.జే.యు) జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్,ప్రదాన కార్యదర్శి సామంతుల శ్యాము లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *