లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కారల్ మార్క్స్ కాలనీ లో వినాయకుడి ప్రత్యేక పూజలు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజలపై గణపతి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆశీస్సు లతోనే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో శివ సాయి గణేష్ మండలి, ఫ్రెండ్స్ యూత్ విగ్రహ దాత ఎర్రం అనూష సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి చివరి రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించా
రు.గణనాథుని అనుగ్రహం ఉండాలని తాను ఆ దేవుడినిప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి
ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధి లో తలపెట్టిన అభివృద్ధి.సంక్షేమ పథకాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. మత
సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అంద
రూ భక్తి భావం పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమన్నారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గంలోని అందరూ
సుఖసంతోషాలతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్లాలని
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి,కాంగ్రెస్ నాయకులు బుర్ర కొమురయ్య,
శివసాయి గణేష్ మండలి ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు పొనగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ప్రణీత్, కమిటీ సభ్యులు కొమురవెల్లి శ్రీనివాస్, లోత్ రాకేష్, సాంబరాజు శ్రీకాంత్, ఎండి రజాక్, లతో పాటు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *