శ్రీవరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
వరంగల్, నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని హసన్ పర్తి మండల పరిధి వంగపహడ్ గ్రామంలో దొమ్మరి సంఘం వారి శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఎంతో కనుల పండుగగా భక్తి శ్రద్దలతో సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు వంగపహాడ్ గ్రామంలో విగ్రహధాత ముస్కు పవన్-స్వప్న దంపతులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో మమేకమవుతూ బోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ముస్కు ఈషి, ముస్కు వేణు, కాళిదాస్ సురేశ్, ముస్కు రాజేష్, ముస్కు చెందు, ముస్కు టింకు, దొమ్మరి సంఘం కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.