అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి.
మరిపెడ నేటి దాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని గాలివారి గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి తమ సొంత ఖర్చులతో విద్యార్థులందరికీ సుమారు 5000 విలువైన
నోట్ పుస్తకాలు,పలకలు,బలపాలు, పెన్నులు,పెన్సిల్లు పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మురళీధర్ వెంకన్న,ఫైజుద్దీన్,బాలు, లింగాల మహేష్ గౌడ్ అంగన్వాడి టీచర్లు రాములమ్మ,అచ్చమ్మ,అనిత గ్రామస్తులు వెంకన్న,సునీత లాలయ్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.