అడ్వకేట్లకు హైకోర్టు ఉపశమనం

వేసవి తీవ్రత వల్ల విధులకు రాలేకపోతే వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశం

__@హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి

నేటిధాత్రి, హైకోర్టు హైదరాబాద్:- రాష్ట్రంలో వేసవి తీవ్రత అధికమవడంతో విధులకు హాజరు కాలేకపోతున్న లాయర్లకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల వల్ల న్యాయవాదులు గైర్హాజరైనట్టయితే వారి కేసులకు సంబంధించి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని కోర్టుల జ్యుడిషియల్ అధికారులు (మేజిస్ట్రేట్లు) పాటించాలని స్పష్టం చేశారు. హైకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వెలువడిన ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు పంపినట్టు తిరుమలాదేవి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!