
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దుద్దిళ్ళ శ్రీను బాబు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలములోని పోతారం గ్రామములో ఎన్నికల ప్రచారం లో భాగంగా దుద్దిళ్ళ శ్రీను బాబు ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు
ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందనీ సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూపాయలు 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందనీ శ్రీను బాబు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ లు నాగినేని జగన్ మోహన్ రావు చొప్పరి సధానందం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు