
మహాముత్తారం నేటి ధాత్రి.
మ హ ముత్తారం మండలంలోని
రెడ్డిపల్లి గ్రామం శివారులలో అటవీ ప్రాంతంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కుటుంబ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అందిన సమాచారం మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలోసిబ్బంది దాడి చేయగా రెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 9 ప్రాంతాల్లో తయారు కేంద్రాలు గుర్తించి సుమారు 6600 చక్కర ద్రావకాన్ని ధ్వంసం చేసి సుమారు 220 లీటర్ల గుడుంబాను స్వాధీనపరచుకొని ముగ్గురు వ్యక్తుల పైన కేసులు నమోదు చేయడమైనది మరియు మరికొంతమంది గుడుంబా తయారీదారులను గుర్తించవలసి ఉంది వారిని గుర్తించిన తర్వాత వారిని పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.