భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో తాపి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో జెండా ఎగురవేసిన మే డే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు . మాట్లాడుతూ కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తాపి వర్కర్స్ యూనియన్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్,ఎం డి నవాబ్,పెద్దినేని శ్రీనివాస్,ట్రెడ్ ఎలక్ట్రికల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్, యూత్ నాయకులు గాడి విజయ్,మాచినేని భాను, మహిళా నాయకురాలు జాస్తి గంగాభారతీ,పి. శారద,యస్ కె రసూల్ బీ,యస్ కె ఫయజ్, తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు