పదో తరగతి ఫలితాల్లో గౌతమి విద్యానికేతన్ ప్రతిభ

@ 9.8 ,9.7 జిపిఏ లతో సత్తా చాతిన విద్యార్థులు

#నెక్కొండ, నేటి ధాత్రి: నెక్కొండ మండల కేంద్రంలోని గౌతమి విద్యార్థి హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మరోసారి తమ సత్తా చాటారు. నెక్కొండకు చెందిన విద్యార్థి బూరుగుపల్లి సహజల్ యోధన్ శాస్త్రి 9.8 జీపీఏ తో పాఠశాల టాపర్ గా నిలవగా బాదావత్ నూతన్ వర్మ తోకల హర్షిత్ లు 9.7 జిపిఎ సాధించి ద్వితీయ తృతీయ ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్ ప్రిన్సిపల్ అనంతుల కల్పనలు తెలిపారు అప్పలరావుపేటకు చెందిన గోనె కృతిక 9.5, నెక్కొండకు చెందిన మహమ్మద్ వహీదా , బోడ రామ్ చరణ్ ,కల్వచర్ల షాఋగ్న లు 9.3 జిపిఏ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు , ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఫలితాల అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమొంటోలు అందజేసి శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!