ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం

100% ఉత్తీర్ణత

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం శ్రీలత అన్నారు.
మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కే వర్షిత 9.5 భాను శ్రీ 9.2 గ్రేడ్ తెలిపారు. మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.అనంతరం హెచ్ ఎం మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారనిఅన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్ధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!