హనుమకొండ లోని స్నేహ నగర్ లో గల ఎస్.ఆర్. పాఠశాల విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎస్ ఆర్ పాఠశాలల జోనల్ ఇంఛార్జ్ రమ శరవన్ అన్నారు.
మంగళ వారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్నేహ నగర్ ఎస్. ఆర్ పాఠశాల విద్యార్థులు నలుగురు 10/10G.P.A.సాదించారనివారు ఏ.స్పందన, సి. ఎచ్.రూప కృష్ణ, జి. లిపిక, బి.శాంత,అని తెలిపారు.
మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినారని అన్నారు.
అనంతరం ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని అన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు,,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్నేహ నగర్ ఎస్.ఆర్. విద్యార్థుల ప్రభంజనం.
