రాజారాంపల్లి లో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని రైతులను,ఉపాధి హామీ కూలీలను కోరిన బిఆర్ఎస్ నాయకులు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలు మరియు వడ్లు కొనుగోలు కేంద్రంలో రైతులు,హమాలి సోదరులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది, అలాగే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని అమలు చేయలేక, అన్ని రంగాల్లో విఫలమైనందున కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో వ్యతిరేకత ఉంది వచ్చే ఎన్నికల్లో ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి బారీ మెజారిటీతో గెలిపించాలని, ఉపాధి హామీ కూలీలను,రైతులను,కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల బారాస పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ రాజారాంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేశం మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రియాజ్ ఏలేటి చంద్రారెడ్డి మెరుగు జానీ దుర్గం కృష్ణ ఇప్పల రాజు మేకల రాజేశం జక్కుల తిరుపతి సిహెచ్ తిరుపతి ఉప్పు రాజయ్య దేవి నరేష్ గాజుల నరేష్ బైరి రామచందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!