ఓపెన్ స్కూల్స్ టెన్త్ ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఇఓ రాంకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మండల కేంద్రము లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్ & ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రాంకుమార్ ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము పరీక్షలు సిసి టీవీల నిఘా మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించినట్లు వారు తెలియజేశారు మూడు పరీక్ష కేంద్రాలను సందర్శించిన డీఈఓ పరీక్షల నిర్వహణ పరీక్షా కేంద్రాలలోని మౌలిక సదుపాయాల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓపెన్ పదవ తరగతిలో 247 మంది దరఖాస్తు చేసుకోగా 214 మంది హాజరైనట్లు ఓపెన్ ఇంటర్లో 382 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 327 మంది హాజరైనట్లు వారు తెలియజేశారు. వీరి వెంట సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్ పరీక్షల సహాయకులు కుసుమ కృష్ణమోహన్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!