చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలోని పెద్దచెరువు పని ప్రదేశాన్ని గురువారం రోజు న జెడ్పీ సీఈవో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, అనంతరం ఆమె మాట్లాడుతూ కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది మరియు ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. వీరి వెంట పంచాయితీ రాజ్ డి ఈ రవి కుమార్, ఏ పీ ఓ అబ్దుల్ అలీం, ఇ. సి. సుధాకర్, టి.ఎ. స్వామి, పంచాయతి కార్యదర్శి విష్ణు, మేట్ రాజు మరియు కూలీలు పాల్గొన్నారు.