కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటిధాత్రి ఏప్రిల్ 17
ఉప్పల్ డివిజన్లోని కురుమ నగర్ ,న్యూ శాంతినగర్, గణేశ్ నగర్, శ్రీరామ కాలనీ, మరియు బీరప్ప గడ్డ రామచంద్రస్వామి దేవాలయం,కనిగిరి వెంకటేశ్వరా స్వామి దేవాలయం లో శ్రీరామ నవమి సందర్భంగా సీతా రాముల కల్యాణమహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ కార్పొరేటర్, రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సదర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు అనంతరం స్వామీవారికి రజిత పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ ల అధ్యక్షులు పాల్గొన్నారు