ముత్తారం :- నేటి ధాత్రి
శ్రీరామనవమి పురస్కరించుకొని ముత్తారం మండలంలోని పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించారు లక్కారంలోని శ్రీ కోదండ రామాలయంలో వేద పండితుల మంత్రోత్సవంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములు కల్యాణ వేడుకలు నిర్వహించారు మండలంలోని ఖమ్మం పల్లి ఓడేడు ముత్తారం కేసనపల్లి తో పాటు పలు గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు వేద పండితులు రామాయణం గురించి వివరించారు భక్తులు శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు విశేష సంఖ్యలో పాల్గొని అక్షింతలతో దీవెనలు అందుకున్నారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు