మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన నవాబుపేట గ్రామంలో ఒంటరి మహిళ పురుగుల లక్ష్మమ్మ (45) దారుణ హత్యకు గురైంది. గత కొన్ని సంవత్సరాల క్రితం భర్త
మృతి వాతపడ్డారు. అనంతరం కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తుంన్నారు లక్ష్మమ్మ నవాబుపేట మండల కేంద్రంలోని
తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసించేది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె చుట్టుపక్కల వారికి కనిపించకపోవడంతో ఎక్కడికైనా ఊరికి
వెళ్ళి ఉండవచ్చునని
వారు భావించారు.
తీరా సోమవారం ఆమె నివసించే ఇంటి నుండి దుర్వాసన వెలువడటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పోలీసు వారు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చూడక తలపై, రక్త గాయాలతో ఆమె మృతి చెంది ఉండడం కనిపించింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. మృతురాలు మరణించిన తీరును బట్టి ఆమెపై ఎవరైనా బలవంతంగా అత్యాచారం జరిపి, హత్య చేసి ఇంటికి తాళం వేసి పారిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయమై ఇంకా పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు.
పోలీసుల సమగ్ర విచారణతో
వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ గ్రామ ప్రజలు భావిస్తున్నారు