హసన్ పర్తి / నేటి ధాత్రి
తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాడిన వారికి ఏ రాజకీయ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించలేదని ఏ బి ఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు కావున విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.