కౌమర దశ కార్యక్రమం పై అవగాహన

గొల్లపల్లి నేటి ధాత్రి:
ఆదర్శ పాఠశాల గొల్లపల్లి యందు ఆడ పిల్లల సాధికారక క్లబ్ ఆధ్వర్యంలో కౌమర దశ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌమర దశలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల సాధికారత తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన విషయాలను కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రోగ్రాం కన్వీనర్ తాడూరి శ్రీనివాస చారి విద్యార్థులకు ఆడపిల్లల సాధికారత సంబంధించిన విషయాలను ప్రధాన వక్తగా తెలియజేశారు. కౌమార దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా కన్వీనర్ తాడూరి శ్రీనివాసచారి, పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తో పాటు తిరుపతి వైస్ ప్రిన్సిపాల్ కాంతం నగేష్, ఎన్ పెద్దన్న, టి రాజేశ్వరి, ఏ సంధ్యారాణి, జి సంధ్య, అర్చన, అన్నపూర్ణ, కె రజిత, ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!