పిసిసి మెంబర్ న్యాయవాది చల్లూరి మధుకు ఎంపి టికెట్ ఇవ్వాలి

ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మండల కేంద్రము లో పీక కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు లో ప్రముఖ న్యాయవాది గా పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాల్లో పనిచేసి‌ పిసిసి మెంబర్ ఎదిగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఇంతవరకు నేతకాని సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ ఇవ్వలేదు ఇలాంటి నికార్సయిన నిజాయితీ, నిబద్ధత కలిగిన చల్లూరి మధుకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెంది ప్రజలు ప్రజా పాలన ను గౌరవవిస్తారన్నారు పీక కిరణ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు శంకరి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *