బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను పరామర్శించిన యువజన నాయకులు.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

కరకగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపిపి రేగా.కాళికా రేగా సత్యనారాయణ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన బైపాస్ సర్జరీ చేసుకొని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బిఅర్ఎస్ పార్టీ మండల యుత్ ప్రెసిడెంట్ గుడ్ల.రంజీత్ కుమార్ మన్యం న్యూస్ రిపోర్టర్ బట్టా.బిక్షపతి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు చెప్పిన సూచనలు,సలహలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఉపసర్పంచ్ ఈసం.సమ్మయ్య ఊకె.నరేష్,ముండ్రాతి రమేష్,గుర్రం.లాలయ్య, మెహన్ లాల్,బోడా.ముత్తయ్య,గిద్దె.సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *