సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై – మల్దకల్ శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బిజ్వారం సామాజిక కార్యకర్త ఎస్.తిరుమలేష్ ప్రత్యేక పూజలు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ బిల్లు పై నేడు ప్రత్యేక న్యాయ మూర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బుధవారం బిజ్వారం తిరుమలేష్,సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం విజయవంతం కావాలని మల్దకల్ తిమ్మప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఏడుమంది ప్రత్యేక న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పై చర్చకు తీసుకువస్తున్న శుభ సందర్భంలో వాదన ముగిసేవరకు న్యాయమూర్తులకు సంపూర్ణ ఆరోగ్యం,జ్ఞానపరంగా వాదించుటకు స్వామి వారి ప్రత్యేక ఆశీస్సులు వారికి ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లు దక్కాలని అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆశయం ఫలించాలని బిజ్వారం తిరుమలేష్ కోరుకున్నారు.సుప్రీంకోర్టు లో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయినట్లైతే ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు విద్యాపరంగా రాజకీయ పరంగా,అనేక రంగాల్లో బాగుపడే అవకాశం ఉంటుందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకై మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వాల వరకు సంపూర్ణ మద్దతుగా ఉన్న శుభసందర్భంలో తప్పకుండా సుప్రీంకోర్టు లో బిల్లు పాస్ అవుతుందని బిజ్వారం తిరుమలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.