ద్వితీయ బహుమతి అందుకున్న గిరి ప్రసాద్ టీం
పరకాల నేటిధాత్రి
ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి షెటిల్ టోర్నమెంట్ ముగిశాయి.గత రెండు రోజులుగా నిర్వహించిన షెటిల్ టోర్నమెంట్ లో విజేతలకు ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్,అధ్యక్షుడు సంజయ్ శ్రీను,ప్రధాన కార్యదర్శి వేణు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి హుజురాబాద్ టీం శరత్,చంటి రెండవ బహుమతి పరకాల టీం
బండారి గిరిప్రసాద్,ఎండి అజ్జు మూడవ బహుమతి పరకాల టీం మారపల్లి రణధీర్,రఘు బహుమతులు అందజేయడం జరిగింది.షెటిల్ టోర్నమెంట్ కు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు చందు,వినోద్,సతీష్,సాయి, ప్రవీణ్,మోహన్,అనిల్, దామోదర్,అన్వేష్,బాబు, వర్ధన్,చంటి,లక్ష్మణ్,క్రాంతి,జయంత్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.