పాలకుర్తి, నేటిధాత్రి:-
పాలకుర్తి మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్, కీర్తి ఉమారాణి రాణి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొర్రూరు మండలానికి చెందిన 50 మంది మేరు కులస్తులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. దయాకర్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో సోమ సతీష్, ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీను, కోశాధికారి శీలం కోటి, మేడిగ వెంకటేశ్వర్లు, వెంకటనర్సయ్య, రామగిరి నర్సింహారావు, బొమ్మిదేని రవి, మాడిశెట్టి లక్ష్మినారాయణ, నీలం రామదాసు, సోమ యాకాంతం, ఉదయ్ కుమార్, తదితరులు ఉన్నారు.