బిఆర్ఎస్ సంక్షేమ పథకాలే పేదలకు ‘శ్రీరామరక్ష’..

మర్రిపెళ్లి గూడెం గౌడ కులస్తులు బిఆర్ఎస్ లో చేరిక…

ఎమ్మెల్సీ హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో చేరికలు…..

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం మరి పెళ్లి గూడెం గ్రామ గౌడ కులస్థులు మంగళవారం ఎమ్మెల్సీ,హుజురాబాద్ బిఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్సీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజలకు శ్రీరామరక్షగా ఉందని అన్నారు. గౌడన్నల కోసం బీమా పథకంతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా అందించింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. వైన్స్ టెండర్ లో కూడా గౌడ కులస్థులకు ప్రత్యేక కేటాయింపు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కేసీఆర్ కారణమయ్యాడున్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మాట్లాడి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. బిఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వర్గాల కోసం ఆలోచించి రూపొందించామని, దాంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టో కూడా తయారు చేశానని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ నియోజకవర్గం మార్చి చూపిస్తానని అన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేస్తూ సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి మహిళకు 3000 అందిస్తామన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని, ప్రతి ఇంటికి ఉచితంగా ఐదు లక్షల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టమన్నారు. ప్రజలంతా అండగా ఉండి మరోసారి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పులి నాగరాజు, సర్పంచ్ కిరణ్ మై విజయ్, మాజీ సర్పంచులు రమేష్, ఏకే, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, బారి స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!