కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ జడ్పిటిసి ముత్తె సత్తన్న

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:

లక్షెట్టిపేట మండల జడ్పిటిసి ముత్తే సత్తన్న ఈరోజు స్థానిక మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా ముత్తే సత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఒంటెద్దు పోకడ నచ్చక బిఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు చూసి బిఆర్ఎస్ లో చేరానని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి లక్షెట్టిపేట మండల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *