`మంత్రిని గట్టిగడగాలే!
`సబ్జెక్టు తో రావాలే!
`ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టారని నిలదీయాలే.
`ప్రతిపక్షాలకు మంత్రి గంగుల రివర్స్ కౌంటర్.
`ఖంగుతిన్న ప్రతిపక్షాలు.
`ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు ఇరుకున పెడదామనుకున్నారు.
`పోలీసులు అడ్డుకుంటారని ఊహించారు.
`అల్లరి చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్నారు.
`లాఠీ చార్జి చేస్తే రాజకీయం చేద్దామనుకున్నారు.
`మంత్రి గంగుల పిలిచి గిట్లడగాలే! చెబితే ఆశ్చర్య పోయారు.
`గంగుల రివర్స్ గేమ్ అర్థం కాక దిక్కులు చూసిన ప్రతిపక్షాలు.
` ప్రజల ముందు తెల్ల మొహం వేశారు.
`అవాక్కైన ప్రతిపక్షాలు.
`చేరుకోవడానికి ప్రతిపక్షాలకు సమయం చాలా పట్టింది.
` మంత్రిని నిలదీద్దామనుకుంటే ప్రతిపక్షాల పరువు తీసిన మంత్రి
` మెల్లగా అక్కడనుంచి జారుకున్న ప్రతిపక్షాలు
` సమాధానాలు చెప్పడంలో దిట్ట
` ప్రతిపక్షాలకు మాట లేకుండా చేయడం ఆయనకే చెల్లింది.
` గతంలో ఓసారి కాలేజీ విషయంలో సక్సెస్ అయ్యారు.
` తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించి, నోరు మూయించారు!
` ఇలా జరిగిందేమిటని ప్రతిపక్షాలు తేరుకోలేకపోయారు.
`ఆనందంతో రైతుల చప్పట్లు.
` వింతైన సంఘటన…మంత్రి గంగులకు అభినందనలు.
హైదరబాద్,నేటిధాత్రి:
నాయకుడంటే నవ్వుతూ వుండాలి. నలుగురితో వుండాలి. నాలుగు మంచి ముచ్చట్లు చెబుతూ వుండాలి. నలుగురికి మంచి పనులు చేసి పెడుతుండాలి. నా అనుకునే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. ఇవే జనం కోరునేవి. అలాంటి గుణం, సుగుణం వున్న నాయకుడు గంగుల కమలాకర్. ఆయన రూటే సెపరేటు. అందరిలా వుంటే ఆయన ప్రత్యేకతేముంది. అందుకే ఆయన విలక్షణమైన నాయకుడు. ప్రజల నాయకుడు. సహజంగా రాజకీయాల్లో వుండేవారు…ముఖ్యంగా పాలకపక్షంలో వుండేవారు ప్రశ్నను అంగీకరించరు. తాము చెప్పిందే వేదమనుకుంటారు. నిలదీతను అసలే ఇష్టపడరు. ఎదురొచ్చి నిరసన తెలిజేస్తే ఊరుకోరు. ఉపేక్షించరు. కొన్ని సార్లు ఎదుటివారిపై పది మందిలో వున్నా సరే కట్టలు తెంచుకునే కోపం ప్రదర్శిస్తుంటారు. ప్రశి ్నంచేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. దరి చేరనివ్వరు. అవసరమైతే పోలీసుల సహాయంతో ప్రతిపక్షాలు చెల్లాచెరుదు చేయిస్తారు. ఇ ంకా, ఇంకా చాలా చాలా చేయిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా నాయకులు ఇలాగే వుంటారు. మన దేశంలో అదే కోవకే చెందిన వారు ఎక్కువశాతం నాయకులుంటారు. కాని ఒక్క గంగుల కమలాకర్ మాత్రం అందుకు పూర్తి విభిన్నం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రూటే సెపరేటు. ఆయన తీరు వేరు. ప్రతిపక్షాలు ఎదురౌతే చిరునవ్వుతో పలకరిస్తారు. వారు నిరసన తెలియజేసేందుకు వచ్చారని తెలిసినా దగ్గరకు పిలుకుంటారు. నినాదాలు చేస్తుంటే కూడా చూస్తుంటారు. వారిపై కోపం ప్రదర్శించరు. ఎదురొచ్చిన ప్రతిపక్షాలను పలకరిస్తారు. నిలదీయాలన్నంత కసితో వచ్చిన ప్రతిపక్షాలు సైతం చల్లబడేలా చేస్తారు. వారు మారు మాట మాట్లాకుండా చేస్తారు. ఇదీ మంత్రి గంగుల స్టైల్. తనతో రాజకీయంగా విభేదిస్తూ, రాజకీయంగా తనపై పై చేయి సాధించాలని చూస్తున్నవారు ఎంత సబ్జెక్టుతో వచ్చారో వారినే ఎదురు ప్రశ్నించి, గందరగోళంలో పడేస్తారు. ప్రశ్నించాలని వచ్చిన వారు అయోమయంలో పడతారు. మంత్రి అలా పిలుస్తాడని ఊహించకపోయిన ప్రతిపక్షాలు నోళ్లు వెళ్లబెట్టుకునేలా చేస్తాడు. దటీజ్ మంత్రి గంగుల.
గతంలోకూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయినా ప్రతిపక్షాలలో మార్పు రాలేదు.
కాని మంత్రి గంగుల తీరులో మాత్రం అదే సమయస్పూర్తి తీరు…అది ప్రతిపక్షాలకు మింగుడు పడని తీరు. అయినా ప్రతిసారి మంత్రి గంగులను వ్యతిరేకించడం ఆయన దగ్గరకు చేరి మౌనాన్ని ఆశ్రయించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. తాజాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు దిగులు పడొద్దని ప్రభుత్వం అండగా వుంటుందని చెబతున్నారు. ఆదుకుంటుందని భరోసా ఇస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు ఎక్కడా ఇసుమంతైనా ఇబ్బంది కలొగొద్దని ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని, పరిహారం చెల్లిస్తామని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ధైర్యం చెబుతూ వున్నారు. ఇదే సమయంలో కొంత మంది కాంగ్రెస్కు చెందిన ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన మంత్రి గంగుల వారిని పిలిచి మీ సమస్యమేమిటో చెప్పండి? అని అనగానే ప్రతిపక్షాల నాయకులకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఇదే సరైన సమయం అనుకొని అదును చూసి మంత్రి గంగుల గత ఏడాది కరీంనగర్లో ఎంత ధాన్యం సేకరణ జరిగింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎంత సేకరణ జరిగింది? నానిన వడ్లలో ఎంత తేమ శాతం వుండాలి? అసలు ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? ఎలా చేస్తారు? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రతిపక్షాలను అడుగుతూ వారిని గుక్కతిప్పుకోకుండా చేశారు. దాంతో అక్కడున్న వారు అంతా అవాక్కయ్యారు. అసలు ప్రతిపక్షాలు మంత్రి దగ్గరకు వస్తే ఎలా రావాలి? మంత్రిని గట్టిగ అడగాలే..అడగాలంటే మీ దగ్గర సబ్జెక్టు వుండాలే! ఏం ప్రతిపక్షాలయ్యా? అంటూ వారి గాలి తీశారు. ఇదే సమయంలో గత ఏడాదిలో కరీంనగర్ జిల్లాలో ఎంత ధాన్యం సేకరణ జరిగిందో తెలుసా? చెప్పండి? అని ప్రతిపక్షాలను ప్రశ్నించేసరికి వారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. వెంటనే గత ఏడాది యాసంగిలో ఏడున్నర లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ కరీంనగర్లో చేయడం జరిగింది. ఈసారి ఇప్పటి వరకే 17.5లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. లెక్కలు తెలుసుకొని రావాలి. అంతే గాని ఆగమాగం చేస్తామని విచ్చి మీరే ఆగమౌతే ఎట్లా అని వారిని మంత్రి గంగుల ఊరడిరచడంతో రైతులు చప్పట్లు కొట్టారు. ప్రతిపక్షలను వెర్రివెంగలప్పలను చేశాడు. తాము మంత్రిని నీళ్లు నమిలిద్దామని వచ్చిన వచ్చిన ప్రతిపక్షాలకు మంత్రి గంగుల రివర్స్ కౌంటర్తో అంతా ఉలిక్కిపడ్డట్టైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని, పోలీసులతో కొట్టిస్తే రాజకీయం చేద్దామని ప్రతిపక్షాలు అనుకున్నాయి. పెద్ద స్కెచ్ వేసుకొని రైతులను మంత్రి పరామర్శిస్తున్న ప్రాంతానికి వచ్చాయి. కాని వారు అనుకున్నది ఒకటి. జరిగింది మకొకటి కావడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కనీసం నినాదాలు కూడా చేసే ఛాన్స్ మంత్రి ఇవ్వకపోవడంతో దిక్కు తోచని స్ధితిలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైతులు మంత్రి గంగుల కమలాకర్ను జిందాబాద్లతో ముంచెత్తారు. దటీజ్ గంగుల అనిపించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్ధితే జరిగింది. స్కూల్ కాంపౌండ్కు సంబంధించి, బిజేపి విద్యార్ధి విభాగానికి చెందిన కొంత మంది విద్యార్ధులు రాజకీయం చేయాలని చూశారు. కాని అక్కడ కూడా వారి పప్పులుకడకుండా చేసి, నచ్చ జెప్పి పంపించి, తనదైన మార్కును చూపించుకన్నారు. గంగులకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు.