MLA Launches ₹3.66 Crore Development Works
మూడు కోట్ల 66 లక్షల లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నేటి ధాత్రి, పాటన్ చేరు :
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలు, విలీన గ్రామాలలో 3 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పటాన్చెరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
శర వేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. హాజరైన మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలు.
