*నీట్ పరిక్ష రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం..*
భాద్యులపై కఠిన చర్యలు తీసుకో వాలి…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ -యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే.పరిక్షా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న లోపాలు,పేపర్ లీకుల వల్ల విద్యార్థులలో నమ్మకాన్ని దెబ్బతిస్తున్నాయి.విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరిక్ష వ్రాస్తే ప్రభుత్వ అసమర్థతో లీకుల పేరుతో రద్దు చేయడం వారి తల్లిదండ్రులకు మోయలేని ఆర్థిక భారం విద్యార్థులకు తీరని నష్టం,ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారంతా నెలల తరబడి కష్టపడి సిద్ధమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు
నీట్ పరిక్ష నిర్వాహణలో జరిగిన నిర్లక్ష్యానికి బాద్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ఇక ముందు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి,ఎన్ టిఏకు డిమాండ్
