Buttermilk Service Wins Hearts
మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన నూక సురేష్ కుమార్
పరకాల,నేటిధాత్రి
పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ లో సాయి గీతా కిరాణం యజమాని నూక సురేష్ కుమార్ మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దాహుర్తి తీర్చాలనే కోరికతో ఏప్రిల్ నెల ప్రారంభం నుండి నేటి వరకు అంగడి బజార్ నుండి వెళ్లే ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.ప్రతిరోజు అంగడి బజార్ కు వెళ్లే ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతున్నది దంచి కొడుతున్న ఎండలను చూసి ప్రజల పై ప్రేమతో మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న సాయి గీత కిరాణం యజమాని సురేష్ కుమార్ ను పలువురు అభినందిస్తూ దీవిస్తున్నారు.ఒకవైపు పక్క వారికే సహాయం చేయని ఈ రోజులలో మండుతున్న ఎండలను చూసి సాయి గీతా కిరాణం యజమాని అంగడి బజార్ నుండి వెళ్లే ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప గర్వకారణమని కొనియాడుతున్నారు.
