Call for Healthy Society on World Health Day
ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే ందుకు ముందుకు రావాలి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండల కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు అసంక్రమణ వ్యాధులు అయినటువంటి(NCD) బిపి, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశా కార్యకర్తలు పాత్ర కీలకమైనదని ఆశా కార్యకర్తల సమావేశంలో తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేసి ప్రతి డిపార్ట్మెంటు లోని సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవి , ఎంపీడీఓ సురేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. రాజేంద్రప్రసాద్, మ్మెలహ్ప్ డాక్టర్స్, సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్, ఆస్పత్రి సిబ్బంది, Ann’s, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
